చిక్కడపల్లి, అక్టోబర్ 3 : హౌసింగ్ బోర్డు షాపుల సమస్యలు పరిష్కరించాలని బంగారు తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మంగళవారం రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు జనార్దన్గౌడ్ మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు నిర్మించిన షాపులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరామని, సానుకూలంగా స్పందించారని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.