కవాడిగూడ/ చిక్కడపల్లి, డిసెంబర్ 29: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్లోని బహదూర్యార్జంగ్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను ఆయన సందర్శించి లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దరఖాస్తు ఫారాలను ప్రతి కాలనీ, బస్తీలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు అందజేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీఆర్ఎస్ నాయకులు షాహి ద్, శ్రీధర్రెడ్డి, శ్రీధర్చారి, జావీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు పడకుండా దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ యువజన విభాగం నాయుడు ముఠా జయసింహ అన్నారు. శుక్రవారం గాంధీనగర్ డివిజన్లోని అన్నానగర్ బస్తీలో పర్యటించారు. అనంతరం జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రజాపాలన సెంటర్ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల ఫారాలులేక పోవడంతో కొంత మంది దళారులు రూ.40 చొప్పున అమ్ముతున్నారని, దరఖాస్తు .ఫారాలు అందుబాటులోకి తేవాలని అన్నారు. నాయకులు ఆనంద్, గడ్డమీది శ్రీనివాస్, శ్రీకాంత్, పున్న సత్యనారాయణ, నర్సింగ్ రావు, రాజ్కుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.