కవాడిగూడ, అక్టోబర్ 27: టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వారంలో మూడు రోజుల పాటు గులాబీ రంగు దుస్తులు ధరించి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్ ముషీరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి బండి రమేష్ ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పార్టీ డివిజన్ కమిటీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తేనే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. తలసాని సాయికిరణ్ మాట్లాడుతూ నవంబర్ 15న వరంగల్లో జరిగే తెలంగాణ విజయ గర్జన మహాసభను విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు బండి రమేష్ మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు పార్టీకి పునరంకితమై పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఐటీ రంగం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శులు ఎడ్ల హరిబాబు యాదవ్, మహ్మద్ షరీపోద్దీన్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల భాగ్యలక్ష్మి , ముఠా పద్మ, హేమలతారెడ్డి, రహ్మత్ అలీ, టి,. రవీందర్, టీఆర్ఎస్ నాయకుడు రెబ్బ రామారావు, బింగి నవీన్కుమార్, సుధాకర్ గుప్తా, కవాడిగూడ, భోలక్పూర్, గాంధీనగర్, అడిక్మెట్, ముషీరాబాద్, రాంనగర్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, వై. శ్రీనివాస్ రావు, రాకేష్కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ ప్రసాద్, ఆర్. మోజెస్, నాయకులు పెంటారెడ్డి, కల్వ గోపీ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, మున్వర్ చాంద్, శంకర్ గౌడ్, జునేద్ బాగ్ధాది, శివ ముదిరాజ్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.