కవాడిగూడ, అక్టోబర్ 12: ప్రతి కార్యకర్త, నాయకుడు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ నూతన కమిటీతో పాటు అనుబంధ కమిటీల పోస్టులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు ప్రకటించినట్లు డివిజన్ కమిటీ నూతన అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడుగా వల్లాల శ్యామ్యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. సాయికృష్ణ, ఉపాధ్యక్షులుగా రఫియా భాను, జె. శ్రీహరి, పి. ప్రవీణ్కుమార్, కే. ప్రకాశ్, ఎండీ యాసిన్, బి. రాములు, ఎం. శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దుర్గస్వామి, సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి. ప్రభాకర్, జీడీ విఠల్ రావు, యుజవన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్. విక్రం రాజ్, ఎస్.
హరిహరణ్, మహిళా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి. మాధవి, సుశీల, మైనారిటీ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎండీ. అన్వర్, ఎండీ. రఫీయోద్దీన్, సోషల్ మీడియా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలం కార్తీక్ యాదవ్, కందుకూర్ దుర్గేష్లను నియమించినట్లు ఆయన వెల్లడించారు. ఈ డివిజన్ కమిటీ, అనుబంధ కమిటీల పత్రాలను ఎమ్మెల్యే ముఠా గోపాల్కు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వల్లాల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ముఠా జయసింహ, జమాలొద్దీన్, శ్రీనివాస్, అన్వర్, దుర్గా స్వామి, ప్రవీణ్గౌడ్, బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, అక్టోబర్ 12 : టీఆర్ఎస్ గాంధీనగర్ డివిజన్ సోషల్ మీడియా కమిటీ అధ్యక్షుడిగా ముఠా శివసింహ నియమితులయ్యారు. మంగళవారం పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ శివసింహను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, నాయకులు పాల్గొన్నారు.