కవాడిగూడ, ఏప్రిల్ 28: తాగునీటి, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్లోని సింగడకుంట, ముగ్గుబస్తీ, కామునికుంట తదితర బస్తీలలో డ్రైనేజీ, తాగునీటి, కలుషిత నీటి సమస్యలపై ఆయన జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్లోని పలు కాలనీలు, బస్తీలలో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అదే విధంగా కవాడిగూడ యూత్ అసోసియేషన్ కార్యాలయంలో కుట్టుమిషన్ల పేరిట స్థలం కబ్జాచేశారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి స్థానికులు తీసుకురావడంతో వెంటనే చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాంచందర్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ వల్లాల శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సురేశ్, డాక్టర్ శ్రీహరి, దుర్గ స్వామి, రవియాదవ్, జమాలొద్దీన్, ప్రవీణ్, సత్యనారాయణ, విక్కి, శివ పాల్గొన్నారు.