ముషీరాబాద్, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 2న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జెండా పండుగ, సంబురాలు నిర్వహించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎమ్మెల్యే మాట్లాడారు. డివిజన్ల వారీగా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు పార్టీ సీనియర్లతో కలిసి జెండా పండుగను విజయవంతం చేయాలని కోరారు. డివిజన్ల వారీగా అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రజల భాగస్వామ్యంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆగస్టు 3వ తేదీ నుంచి డివిజన్ల వారీగా అనుబంధ, బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, 11వ తేది నుంచి 20 వరకు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత నియోజకవర్గ సమన్వయ కమిటీలు, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు.
డివిజన్కు వంద మంది వరకు ఆయా కమిటీలతో స్థానం కల్పించనున్నట్లు చెప్పారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్, నరేశ్, దీన్దాయల్రెడ్డి, శివ, శ్రీనివాస్రెడ్డి, వల్లాల శ్రీనివాస్, నవీన్కుమార్ పాల్గొన్నారు.
చిక్కడపల్లి, ఆగస్టు 31 : ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ మహిళా విభాగం గాంధీనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వనజా గంగాధరి ఆధ్వర్యంలో గాంధీనగర్లో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్ మాచర్ల పద్మ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, లక్ష్మి, హన్మంతు, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ యాదవ సేన ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం జవహర్నగర్ కమ్యూనిటీహాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడు కలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, టీఆర్ఎస్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత అనిల్కుమార్ యాదవ్, బీజేపీ నేత వినయ్కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.