కవాడిగూడ, ఆగస్టు 19: దేశంలో ఎక్కడలేని విధంగా పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకా లు ప్రవేశ పెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. పేదల ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణకే తండ్రిగా నిలిచారని ఆయన అన్నారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్లోని కాశిష్ ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్, హిమాయత్నగర్ మండలాలలోని 79 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన భోలక్పూర్, కవాడిగూడ డివిజన్ల కార్పొరేటర్లు మహ్మద్ గౌసొద్దీన్, గోడ్చల రచనశ్రీ, డిప్యూటీ తాసీల్దార్లు చందన, ఆసిఫ్ఖాన్లతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముషీరాబాద్ మండల పరిధిలో 105 మందికి షాదీముబారక్ చెక్కు లు, 30 కల్యాణలక్ష్మి చెక్కులు, హిమాయత్నగర్ మండల పరిధిలో 3 షాదీముబారక్, 41 మంది కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఒక్కకోజే రూ. 2 కోట్ల చెక్కులను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల హుజూరాబాద్లో సీం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలోనే ఒక గొప్ప పథకంగా పేరొందిందని అన్నారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో 100 మంది దళిత కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ భోలక్పూర్ ఇన్చార్జి బింగి నవీన్కుమార్, నాయకులు మహ్మద్ అలీ, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, రాంచందర్, వై. శ్రీనివాస్రావు, ఎర్రంశేఖర్, ఏ శంకర్గౌడ్, మాజీ కార్పొరేటర్ టి. రవీందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, వల్లాల శ్యామ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.