చిక్కడపల్లి, ఆగస్టు 8 : అన్ని వర్గాల సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చిక్కడపల్లి గంగపుత్ర(బెస్త) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఆ సంఘం ఆధ్యక్షుడు గుండు జగదీశ్ బాబు ఆధ్వర్యంలో జల పందిరి తొట్టెలతో ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మె ల్యే ముఠా గోపాల్ హాజరై మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ మై నార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు రూ.15 కోట్లు కే టాయించడంతో గత యేడాది కంటే ఈసారి ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణాజయేంద ర్ బాబు, సంఘం నాయకులు సురేందర్, బంగారు సం పత్, మురారి వినోద్, నరాల వెంకటేశ్, విజయ్, సాయి లు, నరసింహ, సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు సుమలత, సుజాత, శివరంజని, స్వర్ణలత, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, ముఠా శివసిం హ, రవి శంకర్ గుప్తా, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్లోని తూనికలు కొలతలశాఖ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ రేణుకాఎల్లమ్మ, శ్రీ నవదుర్గా అమ్మవారి ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ వ్యవస్థాపకుడు ఓఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో శ్రీసాయి, ఎస్.బాల్రాజ్, రవీందర్, చిట్టిబాబు, శివకుమార్, మస్తాన్, రాకేశ్, నవీన్ కుమార్, సురేందర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
ముషీరాబాద్, ఆగస్టు 8 : నిరుపేదలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం రాంనగర్ డివిజన్ ఎస్ఆర్టీ కమ్యూనిటీహాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత బంధు అమలు తీరుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం దళిత బంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్, దళిత సంఘాల నేతలు సూర్యనారాయణ, స్వామి, కృష్ణ, గిరి, బల్వంత్, మోజస్, శ్యామ్, శ్యామ్సుందర్, శ్రీనివాస్, శేఖర్, సంపూర్ణ, లలిత, నీలమ్మ, రాజు, సదానంద్, ప్రేమ్కుమార్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ, ఆగస్టు 8 : బోనాల పండుగ సందర్భంగా ఆదివారం కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లోని పలు బస్తీలు, కాలనీలలో ప్రజలు బోనాల పండుగను వైభవంగా జరుపుకున్నారు. కవాడిగూడలోని ఎల్చీగూడలో పోచమ్మ దేవాలయం, భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్ నల్ల పోచమ్మ దేవాలయం, రంగనగర్ రెండో వెంచర్లోని నల్లపోచమ్మ, భూలక్ష్మమ్మ దేవాలయంలో అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రంగానగర్లోని నల్ల పోచమ్మ, భూలక్ష్మమ్మ అమ్మవారికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పట్టు వస్ర్తాలు సమర్పించారు. బోనాల ఉత్సవాల్లో భోలక్పూర్ టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి వై.శ్రీనివాస్ రావు, టీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రావు, రాంనగర్ కార్పొరేటర్ రవిచారీ, ముషీరాబాద్ టీఆర్ఎస్ నాయకుడు నవీన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.