ముషీరాబాద్, జూలై 10: బస్తీలు, కాలనీల్లో విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం రాంనగర్ డివిజన్ ఎస్ఆర్టీ పార్కులో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 220 కోట్ల మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో తానునీటి కోసం అల్లాడిన మారుమూల ప్రాంతాల్లో సైతం నల్లా నీళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పల్లెలు పచ్చదనంతో, తాగు, సాగు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బస్తీలు, కాలనీల్లో చెత్త, మట్టికుప్పల తొలగింపు పెద్ద ఎత్తున చేపట్టిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ఆర్. మోజస్, కిషన్రావు, గోక నవీన్, ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్, జాస్పాల్, బల్వీర్కుమార్, ఇంద్రసేనారెడ్డి, మ్చుకుర్తి ప్రభాకర్, రాజు చారి, టీవీ రాజు, ఆనంద్, జ్ఞానేశ్వర్గౌడ్, రజినీకాంత్గౌడ్, సంపూర్ణ, గజ్జెల సూర్యనారాయణ, నీలాదేవి, సాలమమ్మ మంజుల, తులసి, లక్ష్మి, రాణి, శోభ, సుధాకర్, విక్కి పాల్గొన్నారు.
చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, గ్రంథాలయ చైర్పర్సన్ ప్రసన్న మొక్కలు నాటారు. మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అయోధ్య, ప్రధాన కార్యదర్శి బొల్లం మహేందర్, గ్రంథాలయ కార్యదర్శి నరేందర్, జేఏసీ చైర్మన్ దేవేందర్, సుఖేశ్కుమార్, రోహిత్, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.