మల్కాజిగిరి, డిసెంబర్ 12 : ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని మల్కాజిగిరి(Malkajgiri) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajeshekhar Reddy) అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పలువురు నాయకులు పుష్పగుచ్ఛాలు అందేజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సంధ్య, జయశ్రీ, వాసంతి, లావణ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.