శామీర్పేట/కీసర/ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 19: సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను మంగళవారం మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రజా సం క్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు. అనంతరం శామీర్పేట మండలం, తూంకుంట మున్సిపాలిటీల్లో 59 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనిత, తహసీల్దార్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచులు, ఎంపీటీసీలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆసరాగా కల్యాణలక్ష్మి
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నిరుపేదలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తుందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే మల్లారెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం: జడ్పీ చైర్మన్
పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలతో పాటు ఘట్కేసర్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డిలతో కలిసి జడ్పీ చైర్మన్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావనీ, వైస్ ఎంపీపీ జంగమ్మ, తహసీల్దార్ కృష్ణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.