బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో సుమారు 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
దీంతో పాటు కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల్లో ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు.