వెంగళరావునగర్,మే 4: అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణ్ నగర్ వెంచర్-1 లో నిర్మిస్తున్న థీమ్ పార్క్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యతో కలిసి బోర్వెల్ పనులను ప్రారంభించారు. అనంతరం పార్కులో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే మాగంటి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించి పార్క్ను సుందరంగా తీర్చిదిద్దాలని గుత్తేదారుడికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ నగర్ వెంచర్-1 సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, కాలనీవాసులు, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వం సమకూర్చిన రంజాన్ కానుకలను ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మైనార్టీలకు మంగళవారం పంపిణీ చేశారు. సుల్తాన్నగర్లోని మహ్మదీయ మసీదు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డి.సంజీవ, నేతలు మహ్మద్సర్దార్, గంట మల్లేశ్, మహ్మద్అహ్మద్, మహ్మద్ ముస్తాక్, అజీం, సయ్యద్స్రూల్, వై.రాములు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.