జగద్గిరిగుట్ట, జనవరి10: మహిళలు స్వయం సంవృద్ధిసాధించడంతోనే దేశం పురోగతి సాధిస్తుందని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ భూదేవిహిల్స్లో బుధవారం ఆయన పర్యటించారు. రాష్ట్ర మహిళాసహకార అభివృద్ధి సంస్థ, మహిళా శిశువికాసకేంద్రం సంయుక్తాధ్వర్యంలో జరిగిన శిక్షణ ముగింపు వేడుకల్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. టైలరింగ్, బ్యూటీషియన్ సర్టిఫికెట్లను పలువురు మహిళలకు ఆయన అందజేశారు. స్వయం ఉపాధికోసం శిక్షణ తీసుకోవడం అభినందనీయమన్నారు. మహిళలకు చేయూతనిచ్చేందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు.
బ్యాటరీతో నడిచే ఆటోను మహిళ నడపగా కార్పొరేటర్ జగన్తో కలసి కొంతదూరం ప్రయాణించారు. కాలుష్య రహిత వాహనాల వినియోగం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు డివిజన్కు ఎమ్మెల్యే రాకసందర్భంగా ఘనంగా స్వాగతం పలకగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి నివాళుర్పించి పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఆయనను పలువురు నేతలు కార్పొరేటర్ జగన్ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. రుద్రఅశోక్, కృష్ణగౌడ్, వేణుయాదవ్, జైహింద్, సయ్యద్ష్రీద్, సంఘాలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, సంక్షేమసంఘాల ప్రతినిధులు, మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, బుధవారం ఎమ్మెల్యే వివేకానంద్ను పేట్బషీరాబాద్లోని ఆయన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్వీ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ రూపొందించిన నూతన సంవత్సరం(2024) క్యాలెండర్ను బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ తన క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్వీ కార్యకర్తలు పాల్గొన్నారు.