కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 8 : ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుర్చీ కోసం రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. ప్రజాభివృద్ధి కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. సోమవారం చింతల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీడిమెట్ల డివిజన్ పార్టీ ముఖ్య శ్రేణులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. అధికారం కోసం పాకులాడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాభివృద్ధి కోసం ఎలా పాటుపడుతారని ప్రశ్నించారు. మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్రెడ్డి, సమ్మయ్య నేత, మధుసూదన్రాజు, కాలే నగేశ్, కాలే గణేశ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, విజయ్, హరీశ్, నదిమ్రాయ్, రాముడు యాదవ్, మల్లేశం, మహిళా నేతలు అరుణారెడ్డి, పద్మ, కల్పన, శ్రీదేవిరెడ్డి, విల్లారెడ్డి, జార్జ్, శ్యామల పాల్గొన్నారు.