కాచిగూడ / గోల్నాక, సెప్టెంబర్ 14: పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చే యూతనందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ నుంచి మంజూరైన రూ.14 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నా లుగున్నరేండ్ల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1,667 మంది లబ్ధిదారులకు రూ.8 కోట్ల 57 లక్షల విలువైన చెక్కులు అందజేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కా ర్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపా రు. ఆపత్కాలంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైన క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. కార్యాలయం అధికారులు దగ్గరుండి అన్ని వివరాలు తీసుకొని సులువుగా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారన్నారు. ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ వీలైనంత త్వరగా బాధితులకు చెక్కులు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్యెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. కాచిగూడ డివిజన్కు చెందిన 30మందికి ఒక్కొక్కరికీ రూ.1,00,116 చొప్పున రూ.30, 03,480ల వి లువచేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను గురువారం హిమయత్నగర్ కార్యాలయంలో ఎమ్మార్వో సంధ్యారాణితో కలిసి అందజేశారు. ఎమ్యె ల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పెదింటి ఆడబిడ్డలకు వరం లాంటివన్నారు. పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం సొంత కుటుంబ సభ్యుడిలాగా సీఎం కేసీఆర్ అందిస్తున్న పెళ్లి కానుక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, సుభాష్పటేల్, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, పట్లూరి సతీశ్, సత్యనారాయణ, భీంరాజ్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపల్లి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి..
కిషన్రెడ్డి హయాంలో చేయలేని అభివృద్ధి పనులను కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గ ప్రజల సహకారంతో చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని లింగంపల్లి చౌరస్తా సమీపంలో కొంత కాలంగా డ్రైనేజీ పొంగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు గురువారం స్థానికులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పొంగుతున్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం భూమన్నలైన్లో ఎమ్మెల్యే పర్యటించి నూతన సీసీ రోడ్డు వేయాలని,అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సం బంధిత అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకుల వల్లే నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ప్రభుత్వ పథకాలను అందించడంలో కిషన్రెడ్డి ఏ కోశాన పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గెల్వయ్య, డివిజన్ అధ్యక్షుడు ఎర్ర బీష్మాదేవ్, జలమండలి డీఈ సన్యాసిరావు, ఏఈ భావన, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, మహేందర్, శ్రీకాంత్యాదవ్, బి. కృష్టాగౌడ్ పాల్గొన్నారు.