అంబర్పేట, సెప్టెంబర్ 6 : సామాజిక భవనాలు ఉపాధి శిక్షణ కేంద్రాలుగా మారాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. ఈ కేంద్రాలలో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని చెప్పారు. అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట, బాగ్అంబర్పేట డివిజన్లలో కొత్త గా నిర్మించిన పలు కమ్యూనిటీహాళ్లను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్లు వై. అమృత, బి. పద్మావెంకటరెడ్డి లతో కలిసి కిషన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. నల్లకుంట డివిజన్లోని నర్సింహబస్తీలో రూ. 30 లక్షలతో నిర్మించిన కొత్త కమ్యూనిటీహాల్, బాగ్అంబర్పేట డివిజన్ మల్లికార్జుననగర్లో ఇప్పుడున్న కమ్యూనిటీ హాల్ పై రూ.19 లక్షలతో నిర్మించిన రెండో అంతస్తు, సెంట్రల్ ఎక్సైజ్(సీఈ) కాలనీలో రూ.35 లక్షలతో నిర్మించిన కొత్త కమ్యూనిటీహాల్, ఇంద్రప్రస్థకాలనీ పార్కులో నిర్మించిన టూల్ రూమ్, వైభవ్నగర్ కాలనీలో ఉన్న కమ్యూనిటీహాల్ రెండో అంతస్తులో నిర్మించిన టూల్ రూమ్ లను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మహిళలు, బస్తీ, కుల సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వీటిని నిర్మించామని తెలిపారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మా ట్లాడుతూ బస్తీ ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీహాళ్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కమ్యూనిటీహాళ్లలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే బాగుంటుందని, అందుకు తగిన సహకారం అందిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో సీఈ కాలనీ అధ్యక్షుడు రామకృష్ణరాజు, కార్యదర్శి పి.వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరి సుధాకర్రావు, ప్రతినిధులు చిలువేరు యాదగిరి, ఎ.సత్యనారాయణ, శ్యాంసుందర్, పద్మావతి, సాం బమూర్తి, శైలజలతో పాటు ఆయా బస్తీ, కాలనీల ప్రతినిధులు,బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.