కాచిగూడ,ఆగస్టు 21: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ, గోల్నా క, నల్లకుంట డివిజన్లకు చెందిన 20 పేద కుటుంబాలకు రూ. 20,02,320 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, అమృత, ఉమాదేవి, హిమాయత్నగర్ తాసీల్దార్ లలితతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్గౌడ్, కన్నె రమేశ్యాదవ్, డిప్యూటీ తాసీల్దార్ ఆసీఫ్ఖాన్, జగదీశ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక, ఆగస్టు 21 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శా శ్వత పరిష్కారం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇందు కు సంబంధించి నేటి అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ పై ప్లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం అంబర్పేట డివిజన్ ఆహ్మద్నగర్లో రూ. 6లక్షల వ్యయంతో కొత్తగా ఏ ర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో భవిష్యత్లో మురుగు సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. అధికారులతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్పేట, ఆగస్టు 21 : బాగ్అంబర్పేట డివిజన్ న్యూ తురాబ్నగర్లో నెలకొన్న మంచినీటి, రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బస్తీలో మంచినీరు, రోడ్ల సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, శనివారం తెల్లవారుజామున ఆయన బస్తీలో పర్యటించారు. స్థానికులను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడి రోడ్ల సమస్యను ఎమ్మెల్యేకు చెప్పగా త్వరలోనే బస్తీలో నెలకొన్న మంచినీటి, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, అజిత్సింగ్, శ్రీనివాసులు, బస్తీ నాయకులు సలీం, కుజ్బుద్దీన్, బాలాజీ, విజయ్, తేజ తదితరులు పాల్గొన్నారు.