కాచిగూడ,ఆగస్టు 5: నియోజకవర్గంలోని గ్రౌండ్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్, నెహ్రూనగర్లోని జీహెచ్ఎంసీ గ్రౌండ్లో నెలకొన్న సమస్యలను గోల్నాక డివిజన్ అధ్యక్షుడు భరత్రాజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానికులు ఎమ్మెల్యేను కలిసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రౌండ్ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీ సుకువస్తే.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో దొర్నాల యాదగిరి, భరత్ ముదిరాజ్, కాలేరు రామకృష్ణ, రాజన్, కాలేరు రాజు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.