అంబర్పేట, జూలై 18 : ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే అంబర్పేట మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘటం ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. ఈ ఘటాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఆగస్టు 1, 2వ తేదీల్లో జరిగే బోనాలకు పదిహేను రోజుల ముందు మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు ప్రారంభమవుతుంది. పదిహేను రోజుల పాటు అంబర్పేటలోని అన్ని బస్తీలు, గల్లీల్లో రోజుకు రెండు, మూడు బస్తీల చొప్పున ఘటం తిరుగుతుంది. ఘటంలో అలంకరించిన అమ్మవారిని ఎత్తుకొని బస్తీ బస్తీకి తిప్పుతారు. ఆగస్టు 1 వరకు ఘటం ఊరేగింపుగా తిరుగుతుంది.
బస్తీలలో భక్తులు అమ్మవారిని స్వాగతించి పూజలు చేస్తారు. ఈ ఘటానికి ఆదివారం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం మహంకాళి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. దేవాలయాన్ని అన్ని రకాల కూరగాయలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జె. సత్తిబాబు, ఉపాధ్యక్షుడు పి.చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీరాములుముదిరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి సీహెచ్ సుధాకర్, కార్యదర్శి గడ్డం శ్రీధర్గౌడ్, కోశాధికారి మహేందర్రెడ్డి, ప్రతినిధులు బి.వెంకటరెడ్డి, రంగంపల్లిరాజు, కె.అనిల్కుమార్, శ్రీనివాస్యాదవ్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.