హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ బోనాల పండుగ సందర్భంగా బోరబండ డివిజన్లోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బోనాల పండుగకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. బోనాలు అంటే గోల్కొండ, సికింద్రాబాద్ తరువాత బోరబండ బోనాలే గుర్తుకు వస్తాయని ఆయన అన్నారు.