బంజారాహిల్స్ : నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Mla Gopinath) హామీ ఇచ్చారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ ఫేజ్-2 కాలనీకి చెందిన అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్ పనులతో సహా ఇతర అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తిచేయిస్తామని వెల్లడించారు.
ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా నిలిచిపోయిన పనులు త్వరలో ప్రారంభమవుతాయని, సీసీ రోడ్లతో పాటు ఇతర పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. కాలనీలో సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహించాలని స్థానికులు కోరారు. జనవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. పోచమ్మ దేవాలయం, సాయిబాబా ఆలయాలను దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, వెంకన్న, శ్రీనివాస్, అంజయ్య. నాగరాజు, రామకృష్ణ పంతులు, ఇ.రాజు, ఏసురత్నం, శ్రీనివాస్రెడ్డి, నగేష్, జగ్గారావు పాల్గొన్నారు.