ఎల్బీనగర్, జూలై 12 : హస్తినాపురం డివిజన్లోని రోషల్దౌలా వాసులకు న్యాయం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే సుధీర్రెడ్డి డీఆర్డీఓ డైరెక్టర్ సతీష్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రోషన్ దౌలా ప్రాంతంలోని రక్షణ సంస్థల పక్కన ఉన్న 612 నివాసాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, అయితే వారికి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటి వరకు అందజేయలేదని సుధీర్రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మా శ్రీనివాస్నాయక్, నాయకులు రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.