హయత్నగర్ :నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో పూర్తిస్థాయి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో రూ.1.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన మోడ్రన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల అభివృద్ధే ధ్యేయంగా కృషిచేస్తున్నామని తెలిపారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.