రామంతాపూర్, జూలై 25 : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర’లో భాగంగా మంగళవారం రామంతాపూర్ డివిజన్లో పాదయాత్ర చేపట్టి.. ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. పలు సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో గా, మరికొన్నింటిని త్వరలో పరిష్కరిస్తామని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డివిజన్లోని డీమార్టు, శేఖర్బస్త్తీ, ఇందిరానగర్, సత్యనారాయణ స్వామి దేవాలయం వీధి, భరత్నగర్, రాజేంద్రనగర్, నేతాజీనగర్, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరానగర్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు వేయించాలని, మ్యాన్హోళ్ల పై మూతలు వేయించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరగా పనులు చేపడుతామని అన్నారు. అదే విధంగా రాజేంద్రనగర్లో విద్యుత్ స్తంభాలను ఆధునీకరించాలని, వీధి దీపాలు వెలిగేలా చూడాలన్నారు.
పాదయాత్రలో మంచినీరు, డ్రైనేజీ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరగా త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాసు, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, పాలకూర శ్రీకాంత్గౌడ్, డాక్టర్ బీవీ చారి, గరిక సుధాకర్, లేతాకుల రఘుపతిరెడ్డి, కాటెపల్లి రవీందర్రెడ్డి, వనంపల్లి గోపాల్రెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, పల్లె నర్సింగ్రావు, రేపాక కుమారస్వామి, గంగిడి కృష్ణారెడ్డి, శాగ రవీందర్, నారాయణస్వామి, బోసాని పవన్కుమార్, సూరం శంకర్, చాంద్పాషా, డాన్శ్రీను, జహీంగీర్, సీమ అశోక్, నందికంటి శివ, సమద్, అశోక్, ముస్తాక్, తిప్పని సంపత్కు మార్, జేసీబీ రాజు, సంబెటి నరేశ్, వేముల చిన్న, మహిళా సీనియర్ నాయకురాళ్లు భాగ్య రేఖ, సంధ్యారా ణి, మంజుల, చాపల లక్ష్మి, విజయలక్ష్మి, స్వప్న, సబిత, కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం లేతాకుల రఘుపతిరెడ్డి స్వయంగా రాసి, పాడిన పాటల సీడీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.