రామంతాపూర్, జూలై 30 : రామంతాపూర్ చిన్న చెరువులో కొలువైన గంగా లక్ష్మీభవానీ అమ్మవారి కల్యా ణం శుక్రవారం కనుల పండువగా జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం, అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 12 గంటలకు జరిగిన అమ్మవారి కల్యాణానికి ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, ముఠాగోపాల్, కార్పొరేటర్ బండారు శ్రీవాణి, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు, మందముల పరమేశ్వర్రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గంగపుత్రులు అమ్మవారి కల్యాణం, బోనాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దేవాలయం అధ్యక్షుడు పూస సత్తయ్య, తెలంగాణ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ధీటి మల్లయ్య, నాయకులు కాపర్తి మోహనకృష్ణ మాట్లాడుతూ.. శనివారం అమ్మవారికి బోనాలు నిర్వహిస్తామన్నారు. పూజల్లో టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రెడ్డి, గడ్డం రవికుమార్, శంభుసాయి, రమేశ్, సూరం శంకర్, బోసాని పవన్కుమార్, కిరణ్, ఇంటికల సతీశ్, కుర్న లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.