చర్లపల్లి, సెప్టెంబర్ 6 : ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి .. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతవాతావరణంలో జరిగేలా చూడాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సూచించారు. ఉత్సవాల సందర్భంగా అధికారులు, మండప నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, అణుపురం కమ్యూనిటీహాల్లో సోమవారం డిప్యూటీ కమిషనర్ శంకర్ అధ్యక్షతన వివిధ విభాగాల అధికారులు, కార్పొరేటర్లతో కలిసి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గపరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ఉత్సవ కమిటీ, గణేశ్ ఉత్సవ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. గణేశ్ మండప నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ సూచనల మేరకు మండపాల అనుమతి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వర్ణరాజు, శిరీషాసోమశేఖర్రెడ్డి, బొంతు శ్రీదేవి, ప్రభుదాస్, దేవేందర్రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్, కుషాయిగూడ, నాచారం సీఐలు మన్మోహన్, కిరణ్కుమార్, జలమండలి జీఎం జాన్ షరీఫ్, ఈఈ కో టేశ్వర్రావు, వైద్యాధికారి మైత్రేయి, ఎలక్ట్రికల్ ఏఈ ప్రత్యూష, డీఈ బాలకృష్ణ, ఎస్సైలు అనంతచారి, శ్రీనివాస్, మదన్లాల్, మాజీ కార్పొరేటర్లు ధన్పాల్రెడ్డి, కొత్త రామారావు, శ్రీనివాస్రెడ్డి, నాయకులు కాసం మహిపాల్రెడ్డి, బేతాల బాల్రాజు, మణిపాల్రెడ్డి, సప్పిడి శ్రీనివాస్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, ఎంపెల్లి పద్మారెడ్డి, డప్పు గిరిబాబు, సత్యనారాయణ, మహేందర్రెడ్డి, చల్లా ప్రభాకర్, సీతారామిరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, కొత్త అంజిరెడ్డి, వెంకటేశ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్, సెప్టెంబర్ 6 : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాచారం డివిజన్ వీరారెడ్డికాలనీకి చెందిన కొండల్రెడ్డికి మంజూరైన రూ.49వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ సేఫ్టీ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో డీసీ అరుణకుమారి, అధికారులు రజినీ, ఏఈ నరేశ్రెడ్డి, మా జీ కార్పొరేటర్ పావనీరెడ్డి, గడ్డం రవికుమార్, లేతాకుల రఘుపతిరెడ్డి, చిల్ల అశోక్, మేకల ముత్యంరెడ్డి, పల్లె నర్సింగ్రావు, శివ పాల్గొన్నారు.
హబ్సిగూడ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లను సోమవారం ఘనంగా సత్కరించారు. టీచర్స్ డే సందర్భంగా హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వారిని సత్కరించి, అభినందనలు తెలిపారు. గడ్డం రవికుమార్, నందికంటి శివ, యాకాంతరావు, సూరం శంకర్, జేసీబీ రాజు, గణేశ్, సాయి, కృష్ణ, పాల్గొన్నారు.
ఉప్పల్, సెప్టెంబర్ 6 : ప్రేణ అగ్రి నేచర్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో టీఆర్ఎస్పార్టీ సీనియర్ నేత గుడి మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో విత్తన గణపతుల కిట్లను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మధుసూదన్రెడ్డి , ప్రేమ్ సతీష్, నాగరాజు, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గాయం శ్రీధర్రెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
మల్లాపూర్, సెప్టెంబర్ 6 : జీహెచ్ఎంసీ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్లు జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి మున్సిపల్ కార్మికులకు పనిముట్లను అందజేశారు. అధికారులు రమేశ్, జవాన్ యాదగిరి, కనకరాజు, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, బాల్రాజు, నవీన్గౌడ్, రమేశ్, సాయికుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.