కాప్రా, ఆగస్టు 17 : తాగునీటి కనెక్షన్లు ఇప్పించి తమ కష్టాలు తీర్చాలని కోరుతూ కేసీఆర్ మల్లికార్జుననగర్ బస్తీవాసులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో మొరపెట్టుకున్నారు. మంగళవారం కాలనీ అధ్యక్షుడు కిరణ్కుమార్ ఆధ్వర్యంలో బస్తీ వాసులు ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అంజేశారు. ఇటీవల జలమండలి అధికారులు తమపై నమోదు చేసిన కేసులను తొలగింపజేయాలని ఇంటింటికీ నల్లాకనెక్షన్లు ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కేసీఆర్ మల్లికార్జుననగర్బస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, నీటి సమస్యలు తీరుస్తానని తెలిపారు. తమ విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే జలమండలి జీఎం జాన్షరీఫ్ను కాలనీకి పంపించి సమస్యతీరుస్తామని తెలిపారని అధ్యక్షుడు కిరణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రవి, ప్రభాకర్, గని, అప్జల్, వెంకటేశ్, లింగస్వామి, రాజు, పరుశరాములు, సమ్మక్క, రవలి, లలిత, వినోద పాల్గొన్నారు.
రామంతాపూర్, ఆగస్టు 17 : అభివృద్ధి కమిటీలో కాటికాపర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ రామంతాపూర్ కాటి కాపర్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి మంగళవారం వినతి పత్రం అందజేశారు. కాటి కాపర్ల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు అభివృద్ధి కమిటీలో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కాటి కాపర్లు మరింత అభివృద్ధి చెందుతారన్నారు. స్పందించిన ఎమ్మెల్యే కాటి కాపకాపర్ల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జంగయ్య, పురుశురాం, సత్యనారాయణ, సంజీవ, బాబురావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.