ఉప్పల్జోన్ బృందం, ఆగస్టు 10 : పేదల బస్తీల్లో కరోనా వైరస్వ్యాప్తి నివారణతోపాటు, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కాలనీలు, బస్తీల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఉప్పల్లోని శాంతినగర్లో కార్పొరేటర్ రజితారెడ్డితో కలిసి మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవి, వైద్యులు డాక్టర్ ప్రియాంక, మెడికల్ సూపర్వైజర్ ప్రకాశ్, నేతలు గడ్డం రవికుమార్, వేముల సంతోశ్రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. రామంతాపూర్ డివిజన్లోని వార్డు కార్యాలయంలో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ఎమ్మెల్యే బేతి ప్రారంభించారు. అందరికీ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ భాను పాల్గొన్నారు. అలాగే.. పెద్ద చర్లపల్లి వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ సెంటర్ను సోమవారం కార్పొరేటర్ బొంతు శ్రీదేవి .. మల్లాపూర్ జిల్లాపరిషత్ హైస్కూల్లో మొబైల్ వాక్సినేషన్ను అధికారులు ప్రారంభించారు.
కాప్రా సర్కిల్లో కరోనాను అరికట్టేందుకు మొబైల్ వ్యాక్సినేషన్ను ప్రారంభించామని.. వీటి పర్యవేక్షణకు మూడు మొబైల్ కరోనా వ్యాక్సినేషన్ బృందాలను ఏర్పాటు చేశామని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ తెలిపారు. ప్రతి బృందంలో వైద్యాధికారి, ఇద్దరు ఆరోగ్య సిబ్బంది, జీహెచ్ఎంసీ నుంచి ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్, ఆయా ప్రాంతాల రిసోర్స్ పర్సన్లు ఉంటారని తెలిపారు. ఒక్కో బృందం తమకు అప్పగించిన బస్తీలను సందర్శించి, ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోనివారి ఇంటి వద్దకు వెళ్లి మొదటి డోసు వేయడం జరుగుతుందని అన్నారు. ఆయా కాలనీలు/బస్తీల్లో వాక్సిన్ వేసుకోని ప్రజలను గుర్తించి.. వారికి టీకాలు వేయించేందుకు ఆ ప్రాంతాల్లోని కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్సు పర్సన్లు, స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీ) సహకరిస్తారని సర్కిల్ యూసీడీ ప్రాజెక్టు అధికారిణి ఇందిర తెలిపారు. కాప్రా మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రంలో 343 మందికి, పుకట్నగర్లో 217 మందికి, మల్లాపూర్లో 400 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఓలు సైదులు, రాజు, పట్టణ సమైఖ్య మహిళా గ్రూపు అధ్యక్షురాలు ఊర్మిళగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సర్కిల్లో మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలు .. గాంధీనగర్, కాప్రా విలేజీ, న్యూ ఇందిరానగర్, సాయిబాబానగర్, సాయిరాంనగర్, ఎస్టీ కాలనీ, వంపుగూడ, ఎల్లారెడ్డిగూడ, కందిగూడ, నిర్మల్నగర్, వలువర్నగర్, బీజేఆర్కాలనీ, జమ్మిగడ్డ పరిసర కాలనీలను సీఓ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షిస్తారని…వివరాలకు ఫోన్:7780465768లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఆదర్శ్నగర్, చిన్నచర్లపల్లి, ఫ్యామిలీ ప్లానింగ్ కాలనీ, కృష్ణారెడ్డినగర్, కుషాయిగూడ, లక్ష్మీనరసింహనగర్ కాలనీ, పెద్ద చర్లపల్లి, పుకట్నగర్, శుభోదయనగర్, వీకర్సెక్షన్ కాలనీలను సీఓ గోపాల్ పర్యవేక్షిస్తారని.. వివరాలకు ఫోన్: 8686559958లో సంప్రదించాలన్నారు.
బక్షిగూడ, చైతన్యనగర్, కైలాసగిరి, లింగమయ్య నగర్, నవోదయనగర్, న్యూ నర్సింహనగర్, ఓల్డ్మీర్పేట్, రాజీవ్నగర్, ఇందిరానగర్, అశోక్నగర్, మల్లాపూర్ బీసీ ఏరియా, మల్లాపూర్ ఎస్సీ ఏరియా, మర్రిగూడ, నెహ్రూనగర్, ఎన్టీఆర్నగర్, సుభాష్నగర్, బాబానగర్, దుర్గానగర్, నాచారం, సింగంచెరువు, సూర్యనగర్, అంబేడ్కర్నగర్, ఎర్రకుంట, గాంధీనగర్, నాచారం, హనుమాన్నగర్, ఇందిరానగర్, నాచారం, సాయినగర్, ఎరుకల బస్తీలను సీఓ సైదులు పర్యవేక్షిస్తారని, వివరాలకు ఫోన్: 9700357578లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.