రామంతాపూర్, నవంబర్ 6 : ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం రామంతాపూర్ డివిజన్, శారదానగర్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అండర్గ్రౌండ్ డ్రైనేజీ బాగు చేయాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు లబ్ధిదారు లకు సరిగ్గా అందుతున్నాయా?లేదా? అని పరిశీలించారు. అనంతరం బస్తీ దవాఖానను సందర్శించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూ చించారు. కార్యక్రమంలో అధికారులు డీసీ అరుణకుమారి, జలమండలి అధికారులు జాన్ షరీఫ్. శ్రీధర్రెడ్డి, సత్యనారాయణ, చంద న, నాగమణి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు, బాల్రాజు, గడ్డం రవికుమార్, వెంకటేశ్వర్రెడ్డి , సుధాకర్, ముస్తాక్, జేసీబీ రాజు, సూరంశంకర్, తిప్పని సంపత్కుమార్, శ్రీను, ప్రశాంత్, కాలనీవాసులు పాల్గొన్నారు.