ఉప్పల్, నవంబర్ 1 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నా చారం పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సీసీ కెమెరాలను మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ప్రసాద్రావు, కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభి నందనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో కాలనీవాసుల సహకారం ఉండాలని సూ చించారు. కాలనీల్లో సీసీ కెమెమరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తు న్నానన్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరిగిందన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు, వ్యాపారులు, తదితర వాణిజ్య సము దాయాల ప్రతినిధులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నా రు. కార్యక్రమంలో నాచారం సీఐ కిరణ్కుమార్ , నాయకులు మేకల ముత్యంరెడ్డి, కాటేపల్లి రవీందర్రెడ్డి, శ్రీరామ్ సత్యనారాయణ, రాం చందర్, చంద్రశేఖర్, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఉప్పల్ డివిజన్, న్యూభరత్నగర్కాలనీలోని భూలక్ష్మీ ఆలయ పునర్ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి వేముల సంతోష్రెడ్డి రూ.50 వేల ఒక్కరూపాయి విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, నేతలు శామీర్పేట ధర్మారెడ్డి, అన్య వెంకటేశ్, నగేశ్, వేముల దుర్గారెడ్డి, శేఖర్, శ్రీనివాస్, గరిక సుధాకర్, టంటం వీరేశ్, మస్క సుధాకర్, వేముల వెంకట్రెడ్డి, అనితారెడ్డి, కాలనీ వాసులు బ్రహ్మచారి, ప్రభాకర్, శ్యామ్, లక్ష్మణ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, నవంబర్ 1 : మల్లాపూర్ డివిజన్ , బ్యాంక్ కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్, కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, నాచారం సీఐ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు సూర్ణం రాజేశ్, రవికుమార్యాదవ్, శివశంకర్, మన్నెం, హరిబాబు, వెంకటేశ్వర్రావు, అంజ య్య, రవిశంకర్, సురేందర్, కనకయ్య, శ్రీనివాస్నా యుడు, తదితరులు పాల్గొన్నారు.