ఉప్పల్, సెప్టెంబర్ 14 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు అందజేస్తామని పేర్కొన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీడీపీ ఫండ్స్తో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. పాఠ శాలల్లో సమస్యలు గుర్తించి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రామ్మోహన్, డీఈ వేణుగోపాల్, విద్యాధికారులు పాల్గొన్నారు.