కాప్రా, సెప్టెంబర్ 12: టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త్త, నాయకుడు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ ఫస్ట్ఫేజ్ మైదానంలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథులుగా మల్కాజిగిరి పార్లమెంటరీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. సమావేశంలో డివిజన్కు సంబంధించి టీఆర్ఎస్ కమిటీల నిర్మాణం చేశారు. టీఆర్ఎస్ హెచ్బీకాలనీ డివిజన్ అధ్యక్షుడిగా గుండారపు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మధు ముదిరాజ్, కోశాధికారిగా కృష్ణ వేణి, బీసీ సెల్ అధ్యక్షుడిగా బాలరాజు, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రాందాస్ నాయక్, యూత్ అధ్యక్షుడిగా ప్రవీణ్, సోషల్ మీడియా ప్రెసిడెంట్గా శివాజీ, మైనారిటీ ప్రెసిడెంట్గా హలీముద్దీన్, సెక్రటరీగా నిషా రహీముద్దీన్లను నియమించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, టీఆర్ఎస్కేవీ ఆటో యూనియ న్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, రవికుమార్, గరిక సుధాకర్, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వివిధ కాలనీల ప్రతినిథులు పాల్గొన్నారు.
ఉప్పల్, సెప్టెంబర్ 12 : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కమిటీలు కీలక భూమిక పోషించాలని మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, వేముల మారయ్య, బేతాల బాలరాజు, సుదర్శన్రెడ్డి, రాంచందర్, శ్రీనివాస్రెడ్డి, ముస్తాక్, నందికంటి శివ, శివకుమార్, శ్రీనివాస్, ప్రశాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.