ఉప్పల్, సెప్టెంబర్ 11 : అభివృద్ధి పనులను సత్వరం పూర్తిచేసే విధంగా చూడాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని క్యాంపు కార్యాలయంలో ఉప్పల్, కాప్రా ఇంజినీ రింగ్ అధికారులతో శనివారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలంలో వరదనీరు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదే శించారు. కాప్రా ఈఈ కోటేశ్వర్రావు, ఉప్పల్ ఈఈ నాగేందర్, ఏఈ వేణు పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లోని శివాజీ సర్కిల్ ప్రాంతంలో తెల్లవారుజా మున జరిగిన విద్యుత్ ప్రమాదంలో మెడికల్షాపు దగ్ధమైంది. ఈమేరకు బాధితులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ శనివారం పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ నాయకులు గుడి మధుసూదన్రెడ్డి రూ.5 వేలు, వీబీ నర్సింహా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నేత లు గుడి మధుసూదన్రెడ్డి, వీబీ నర్సింహా, పల్లె నర్సింగ్రావు, ఏదుల కొండల్రెడ్డి, ఈరెల్లి రవీందర్రెడ్డి, రాంరెడ్డి, వెంకటేశ్, రవీందర్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్ పాల్గొన్నారు.