ఉప్పల్, ఆగస్టు 30 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్లోని మేకల భారతిగార్డెన్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో ఎంతోమంది పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచారన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచి, వారికి ప్రభుత్వం చేయూ తనందిస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. పేద ప్రజలకు అడగకుండానే అన్ని రకాల పథకాలు తీసుకువచ్చి, వారికి తోడ్పాటు అం దిస్తున్నారని, అన్నివర్గాలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. అభివృద్ధి కోసం అందరిని కలుపుకొని పనిచేస్తామన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసిరావాలని సూచించారు. కార్యక్రమంలో ఉప్పల్ తహసీల్దార్ గౌతమ్కుమార్, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, ప్రభుదాస్, మందుముళ్ల రజితాపరమేశ్వర్రెడ్డి, చేతన, వాణి, నేతలు వేముల సంతోష్రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మేకల మధుసూదన్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.