చర్లపల్లి, ఆగస్టు 27 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, న్యూమారుతీనగర్, జైజవాన్ కాలనీలోని కాప్రా సర్కిల్ శ్రీ మద్విరాట్ విశ్వకర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరాన్ని శుక్రవారం స్థానిక కార్పొరేటర్ శిరీషాసోమశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డి, కుషాయిగూడ సీఐ మన్మోహన్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గపరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించామని, ఆలయాల్లో భక్తులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.
అదేవిధంగా శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మంగారి ధ్యాన మందిరానికి తన వంతు సహాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డిలను సన్మానించారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ మద్విరాట్ విశ్వకర్మ ట్రస్ట్ సభ్యులు జ్యోతిర్మయిచారి, భిక్షపతిచారి, నర్సింహాచారి, రామాచారి, వేణుగోపాలచారి, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, సప్పడి శ్రీనివాస్రెడ్డి, ఏనుగు సీతారామిరెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, గిల్బర్ట్, కుమార్సాయి, బాల్నర్సింహా, కొప్పుల కుమార్, సత్యనారాయణ, ఏఎస్ఏ రహీంతో పాటు విశ్వకర్మ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి, ఆగస్టు 27 : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, జమ్మిగడ్డకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే.. వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రేటర్ పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందజేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని, దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డి, నాయకులు సోమశేఖర్రెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, ఏనుగు సీతారామిరెడ్డి, కుమార్స్వామి, బాల్నర్సింహా, కొప్పుల కుమార్, సత్యనారాయణ, వెంకటేశ్, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.