రామంతాపూర్, ఆగస్టు 23 : దేవాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం పాతరామంతాపూర్లోని మల్లికార్జున స్వామి దేవాలయం స్థలంలో రూ.17. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్యాణ మండపానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి ధర్మకర్తలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం కార్పొరేటర్ బండారుశ్రీవాణి వెంకట్రావు మాట్లాడుతూ దేవాలయానికి కల్యాణ మండపం ఎంతో అవసరమన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆలయ చైర్మన్ ముట్కూరి దయాకర్రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో కల్యాణ మండప నిర్మాణం సుందరంగా చేపడుతామన్నారు. ఆలయ ధర్మకర్తలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని తెలిపారు. మరింత మంది దాతల సహకారం తీసుకొని త్వరిత గతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సూరం కృష్ణ, అర్చకులు శేఖర్బాబు శర్మ, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, సుధాకర్, సూరం శంకర్, మధుసూదన్రెడ్డి, బోసాని పవన్, వెంపటి శ్రీను, జగదీశ్కుమార్, తూటి నర్సింహ, రవి, ఆనంద్యాదవ్ పాల్గొన్నారు.