శేరిలింగంపల్లి, జూన్ 19 : విపత్కర పరిస్థితులలో ప్రజా సంక్షేమంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శేరిలింగంపల్లి శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్కు కాలనీలో ఏర్పాటు చేసిన ఎండీ 320 ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్స్ బ్యాంక్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో లయన్స్ క్లబ్ ముందు వరుసలో ఉంటుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజ లకు అవసరమైన ఆక్సిజన్ పరికరాలను ఉచితంగా అం దజేయడం సంతోషించదగిన విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ లయన్ బాబురావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సూర్యరాజు, శ్రీనివాస్, సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, లక్ష్మినారాయణ గౌడ్, గణేశ్ ముదిరాజ్, హోప్ ఫౌండే షన్ చైర్మన్ కొండ విజయ్, రాజు నాయక్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, నాయకులు అన్వర్ షరీఫ్, సత్యనారాయణ, ప్రతాప్రెడ్డి, యాదగిరిగౌడ్, జనార్దన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు