హఫీజ్పేట్, జూలై17: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వవిప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్లో రూ.3కోట్ల 53వేల వ్యయంతో చేపట్టనున్న జనప్రియ10/ఏ నుంచి సితార హోటల్ వరకు రూ.175లక్షలతో ఆర్సీసీ, ఎన్హెచ్9 నుంచి బచ్చుకుంట వరకు రూ.63లక్షలతో వరదనీటి కాల్వ ఆయాప్రాంతాల్లోని యూజీడీ, ఆర్సీసీ పనులకు శనివారం కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేసి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి అన్నిడివిజన్లను సమపాళ్లలో అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రతికాలనీ, బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వానకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముంపుసమస్య పరిష్కారంలో భాగంగా వరదనీటి కాల్వల పునురుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీకాంతిని, ఏఈ ధీరజ్, వర్క్ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీధర్, హఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షుడు గౌతంగౌడ్, వాలా హరీశ్, వెంకటేశ్గౌడ్, పద్మారావు, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, శాంతయ్య, వీరేందర్గౌడ్, ప్రవీణ్గౌడ్, మీనాక్షి, శ్రీదేవి, పద్మ, సరళ, శిరీష తదితరులు పాల్గొన్నారు.