బండ్లగూడ : ఇంటి ముందు అడుకుంటూ అదృశ్యమైన బాలుడి ఉదాంతాన్ని అత్తాపూర్ ఔట్పోస్ట్ పోలీసులు ఆరు గంటల్లో చేధించారు. ఈ మేరకు బాలున్ని వెతికి తండ్రికి అప్పగించారు.అత్తాపూర్ ఔట్పోస్ట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ జలాల్ బాబా నగర్లో నివాసం ఉండే షేకీల్ కుమారుడు ఫరాన్(12) బుధవారం ఉదయం చెత్త బండి రావడంతో చెత్త వేయడానికి బయటకు వచ్చి అడుకుంటూ కనిపించకుండా పోయాడు.
తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలున్ని నాంపల్లి బస్టాఫ్లో ఉన్నట్లు గుర్తించి స్టేషన్ కు తీసుకువచ్చారు. సాయంత్రం బాలున్ని తండ్రి షకిల్కు అప్పగించారు.ఫిర్యాదు చేసిన ఆరు గంటల్లో బాలున్ని అప్పగించి నందుకు బాలుని తల్లి దండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.