హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డలో ఇవాళ రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన స్థలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన (టిమ్స్) కోసం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. దవాఖాన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.