హైదరాబాద్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ దశదిన కర్మలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. కాగా, అల్లం పద్మ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు.