సీఎం కేసీఆర్ను కలిసిన ఆలయ పాలకమండలి
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 17న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు రావాలని ఆలయ పాలకమండలి సభ్యులు సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో బుధవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రికి ఆహ్వానపత్రిక అందజేశారు.