హైదరాబాద్ : ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచడానికి వార్డు కార్యాలయాలను (Ward Offices)నెలకొల్పామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) పేర్కొన్నారు. శుక్రవారం అమీర్పేట డివిజన్ శ్రీరాంనగర్ లో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనేది ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆలోచన మేరకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వార్డు ఆఫీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
2014 ముందు, తరువాత జరిగిన మార్పును ప్రజలు గమనించాలన్నారు. 60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 9 సంవత్సరాలలో జరిగిందని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని వివరించారు. మనిషి జీవితం ఆఖరి మజిలి ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో శ్మశాన వాటికలను అభివృద్ధి పరిచామని తెలిపారు.గతంలో బల్కంపేట (Balkampeta) ఆలయానికి 40, 50వేల మంది భక్తులు దర్శించుకునే వారని నేడు తొమ్మిది లక్షల మంది భక్తులు వస్తున్నారని తెలిపారు.
ప్రజలు స్వచ్ఛమైన గాలి పొందేందుకు హరితహారం(Harithaharam) ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం(Harithaharam) ద్వారా రాష్ట్రంలో 7.7 క్లీనరి వచ్చిందన్నారు. అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడకుండా అందుబాటులో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.