సుల్తాన్బజార్,జనవరి 17: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో బాక్సింగ్ చాంపియన్ మహమ్మద్ హుసముద్దీన్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతుల మీదుగా రూ.21 వేల నగదు బహుమతి, హోం మంత్రి మహమూద్ అలీ జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్. విక్రమ్కుమార్,అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్,ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర, సభ్యులు బి.శంకర్, ముఖీం ఖురేషి, ఏవీ శ్రీధర్, ఏపీఆర్వో మహ్మద్ వహీద్, నాల్గో తరగతి అసోసియేట్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.