రవీంద్రభారతి, ఫిబ్రవరి 21 : కేంద్ర సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న ఢిల్లీలో నిర్వహించిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువపురస్కారం-2022ను దక్కించుకున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ధరవత్ రాజ్కుమార్ నాయక్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం సన్మానించారు.
తొలి పేరిణి నాట్య కళాకారుడు రాజ్కుమార్ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పురస్కారం అందుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. రాజ్కుమార్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.