రవీంద్రభారతి,సెప్టెంబరు28: కవులు, కళాకారులను, వైతాళికులను, సాహిత్యవేత్తలను, మేధావులను, ప్రోత్సహిస్తున్నామని అంబ్కారీ, క్రీడా, సాంస్కృతి శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం రవీంద్రభారతిలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత ,బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పైడి జైరాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడని కొనియాడారు. పైడి జైరాజ్ సేవలకు గుర్తుగా రవీంద్రభారతిలోని ప్రివ్యూ థియేటర్కు పైడి జైరాజ్ పేరు పెట్టి గౌరవిస్తున్నామన్నారు. కళాకారులకు భవిష్యత్లో ఇచ్చే అవార్డులకు పైడిజైరాజ్ పేరుతో ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్రా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ, మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మంచిర్యాల మున్సిపాల్టీ వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, సతీష్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.