మహేశ్వరం, ఆగస్టు 10: కుల వృత్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో స్థలం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ మంత్రి సబితారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సబ్బండ కులాల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపడుతున్నారన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం మండల అధ్యక్షుడు పెంటల రాయప్ప, ఉపాధ్యక్షులు మిద్దింటి బాల్రాజ్, ముత్యం, కిష్టయ్య పీఏసీఎస్ డైరెక్టర్ పొల్కం బాలయ్య, నాయకులు కరోళ్ల చంద్రయ్య, శివమూర్తి, అంబయ్య, నవీన్, రాజేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని రాంచంద్రగూడతండాలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాట్రావత్ ఈశ్వర్నాయక్ మాతృమూర్తి వెంకటమ్మ ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులకు గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, నియోజకవర్ంగ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లచ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, ఆగస్టు 10 : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ బండి సత్తయ్య కాలనీలో నెలకొన్న మురుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం 41వ వార్డులో పర్యటించిన మంత్రి మ్యాన్హోళ్లు పొంగి ప్రధాన రహదారిపై, కాలనీలో నిలిచిన మురుగు నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. గత మూడు నెలలుగా రహదారులపై, కాలనీ మధ్యలో నిలిచిన మురుగుతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మురుగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తానన్నారు. ఆ దిశగా నూతనంగా డ్రైనేజీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్లీడర్ అర్కల భూపాల్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొక్క రాజేందర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.