కందుకూరు, సెప్టెంబర్ 30 : టీఆర్ఎస్ పటిష్టానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మంత్రి కందుకూరు మండల టీఆర్ఎస్ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మండల పార్టీ నూతన కమిటీ విషయంపై నాయకులతో చర్చించారు. పదువులు ఎవరికి వచ్చినా అందరు కలిసి మెలిసి పని చేయాలని సూచించారు. పార్టీకోసం పని చేసే వారిని గుర్తించి సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, నియోజకవర్గం నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, అందుగుల సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, డైరెక్టరు పొట్టి ఆనంద్, అందుగుల సత్యనారాయణ, మండల క్రిష్ణ, గుయ్యని సామయ్య, బర్కం వెంకటేశ్, రవికుమార్రెడ్డి, పాండుగౌడ్, సదానంద్గౌడ్, తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, ప్రశాంత్చారి, మూల హన్మంత్రెడ్డి, కొలను విఘ్నేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.