కొండాపూర్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర వి ద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శేరి లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ రాయదుర్గంలో గల ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ రూ.3 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బాలుర హాస్టల్ను ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, టెక్నాలజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్లతో కలిసి మంత్రి సబిత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యా, వైద్యాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో వృత్తి విద్యా కోర్సులకు మంచి ఆదరణ ఉందని, ఆసక్తి గల కోర్సులను నేర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచి 12 నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను నెలకొల్పడం జరిగిందని, ఇందులో 4 కళాశాలలను ప్రత్యేకంగా బాలికల కోసం, 1 ఎస్టీ బాలురకు కేటాయించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పెంచేందుకు 1873 ల్యాప్టాప్ కం ప్యూటర్లను అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో దాదాపు 2200 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారని, వారికోసం ప్రత్యేకంగా 22 హాస్టళ్లను ఏర్పాటు చే సేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
రాయదుర్గంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. అసంపూర్తిగా మిగిలిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణాని కి ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ వాణీదేవిలు చెరో రూ.10లక్ష లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇనిస్టి ట్యూట్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో లెదర్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది, శేరి లింగంపల్లి తాసిల్దార్ వంశీ మోహన్, ఆర్ఐ చంద్రారెడ్డి, రవీందర్, శ్రీనివాస్ యాదవ్, చాంద్పాషా, రామేశ్వరమ్మ, రవిశంకర్ నాయక్, రమేష్, క్రిష్ణ, వెంకట్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.